
- బాధిత యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు
- ఆరుగురి అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు
- ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి వెల్లడి
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్జిల్లా కేంద్రానికి చెందిన యువకుడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్చేసి.. బంధించి.. బట్టలిప్పి దాడి చేసి.. ఆపై వీడియో తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బంగారుగూడకు చెందిన సయ్యద్ జహీర్ ను గత జనవరి 8న అదే కాలనీకి చెందిన షేక్ ఇజాజ్ అలియాస్ షేక్రోషన్ వినాయక్చౌక్లో ఆటోలో కిడ్నాప్ చేశారు. షేక్ సలీం అలియాస్ కైంచి సలీం ఇంటికి తీసుకెళ్లి రూమ్ లో బంధించారు. అనంతరం జహీర్ బట్టలిప్పి 9 మంది దాడి చేసి కొట్టారు. ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్చేశారు.
పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు ఈనెల 26న రూరల్స్టేషన్లో కంప్లయింట్ చేశాడు. షేక్ ఇజాస్, షేక్ ముజీబ్, ఖానాపూర్కు చెందిన హసీబుల్లా అలియాస్ లతీఫ్, సయ్యద్ జుబేర్, మసూద్నగర్కు చెందిన షేక్ సోహెల్, మహాలక్ష్మివాడకు చెందిన అమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్సలీమ్అలియాస్కైంచి సలీమ్, రాహెల్, సలీమ్ పరారీలో ఉన్నారు. ఇదివరకే షేక్సలీమ్అలియాస్కైంచి సలీమ్పై ఒక హత్య, అక్రమ ఆయుధాల కేసులు నమోదై ఉన్నాయి. నిందితుల నుంచి 3 ఆటోలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. రూరల్ సీఐ ఫణిధర్, ఎస్ఐ ముజాహిద్ పాల్గొన్నారు.