
వెలుగు, సిటీ నెట్ వర్క్: గ్రేటర్ పరిధిలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 1,86,594 మంది ఎగ్జామ్స్రాయాల్సి ఉండగా, మొదటిరోజు తెలుగు ఎగ్జామ్ కు 1,85,297(99.30శాతం)మంది హాజరయ్యారు. 1,296 మంది హాజరు కాలేదు. ఉదయం 8.30 గంటల లోపే దాదాపు విద్యార్థులంతా ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకున్నారు.
9.30 గంటలకు ఎగ్జామ్ప్రారంభం కాగా, ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన వారిని కూడా లోనికి అనుమతించారు. ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. విజయనగర్కాలనీలోని సెంటెన్స్స్కూల్ఎగ్జామ్సెంటర్ను హైదరాబాద్కలెక్టర్అనుదీప్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ సరళిని పరిశీలించారు. రాజేంద్రనగర్ గవర్నమెంట్స్కూల్లోని సెంటర్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరిశీలించారు.