రామకృష్ణాపూర్ లో ఎలక్ట్రిక్​ బైక్ తయారు చేసిన విద్యార్థి

రామకృష్ణాపూర్ లో ఎలక్ట్రిక్​ బైక్ తయారు చేసిన విద్యార్థి

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన తొమ్మిదో తరగతి స్టూడెంట్​సాయి లాస్విక్​ఎలక్ట్రిక్​ బైక్ తయారు చేశాడు. బైక్​ తయారు చేసిన విధానాన్ని శనివారం స్థానిక విలేకరులకు వివరించాడు. తనకు చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ పరికరాల పట్ల ఎంతో ఆసక్తి ఉందన్నారు. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఎలక్ట్రికల్​ బైక్​ తయారు చేసేందుకు 48 వోల్టేజ్ బీఎల్ డీసీ మోటార్, నాలుగు లెడ్ యాసిడ్ బ్యాటరీలు వాడినట్లు చెప్పాడు.

ఒకసారి చార్జింగ్ పూర్తికావడానికి 4 గంటల సమయం పడుతుందని, 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 80 కి.మీ దూరం ప్రయాణిస్తుందన్నాడు. బైక్​ తయారీలో మెకానిక్​లు సాయి, ముస్తాఫా, తన తండ్రి కృష్ణమూర్తి, ఫ్యామిలీ ఫ్రెండ్ ​శ్రీధర్​రెడ్డి ఎంతో సహయం చేశారని చెప్పాడు. భవిష్యత్తులో సోలార్​తో నడిచే కారును తయారు చేయాలని కోరిక ఉందన్నాడు.