
ఐఐటీ–రూర్కీ, భారత భూగర్భ సర్వే సంస్థ పరిశోధకులు రాజస్థాన్ జైసల్మేర్లోని థార్ ఎడారిలో 16.7 కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారు. డైక్రెయోసౌరిడ్ శాఖకు చెందిన ఈ జీవి పొడవైన మెడ కలిగిన శాకాహారి. 30 అడుగుల నుంచి 40 అడుగుల పొడవు, పొట్టి మెడ, తోక దీని ప్రత్యేక లక్షణాలు. ఇంతకుముందు చైనాలో కనుగొన్న డైక్రయోసౌరిడ్ 16.6 కోట్ల నుంచి 16.4 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది.
దాని కంటే పురాతనమైన శిలాజం థార్ ఎడారిలో లభించడం విశేషం. దీనికి మన పరిశోధకులు థారోసారన్ ఇండికస్ అని నామకరణం చేశారు. భారత్లో ఇలా డైక్రెయోసౌరీడ్ సరీసృప శిలాజం లభించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు మధ్య భారతంలో 19.9 కోట్ల నుంచి 18.3 కోట్ల ఏళ్ల క్రితం నాటి రెండు రకాల సరీసృప శిలాజాలు కనిపించాయి. అవి థారోసారస్ కంటే పురాతనమైన సరీసృపాలైన బారపాసౌరస్, కోటా సౌరసులు.