తాగిన మైకంలో.. డిపో గోడ దూకి ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు

తాగిన మైకంలో.. డిపో గోడ దూకి ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు


నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో  సెప్టెంబర్ 22న రాత్రి బస్సు చోరీకి గురికావడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆర్టీసీ డిపో గోడదూకి అందులోకి ప్రవేశించాడు. ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సోఫీ నగర్ వైపు వెళ్ళగా కంచరోని చెరువు సమీపంలో ప్రమాదానికి గురైంది. 

గమనించిన స్థానికులు వెంబడించి కడ్తాల్ గ్రామ సమీపంలో బైపాస్ దగ్గర బస్సును అడ్డుకొని అతడిని పట్టుకున్నారు. బస్సు ఆగి ఉంటే తీసుకొచ్చానని చెప్పడంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.