ఘోరం: ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు.. 5 మంది మృతి..

ఘోరం: ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు.. 5 మంది మృతి..

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురం సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 5 మంది మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్యాసింజర్ కు వాంతులు రావడంతో ఆర్టీసీ బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన ఆపగా..అదే సమయంలో  వెనక నుండి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బస్సును ఢీకోట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రాజేష్, సెంథిల్, ప్రణవిక, దర్శిలరాణి, ఈశ్వరి సంఘటన స్థలంలోనె మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని రామనాథపురం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం విచారకరం.విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.