ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్పై అత్యాచార కేసు

ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్పై అత్యాచార కేసు

మహిళల భద్రత కోసం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ కొందరు ఖాతరు చెయ్యకుండా ఆకృత్యాలకు పాలడ్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో అత్యాచార కేసులు నానాటికి పెరుగుతున్నాయి. కాగా ఇటీవలే ఫోక్ సింగర్ పై అత్యాచార కేసు నమోదైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. 

పూర్తీ వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలో సుద్దాల మల్లిక్ తేజ అనే వ్యక్తి జగిత్యాల జిల్లా సాంస్కృతిక సారథిలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే మల్లిక్ తేజ పలు ఫోక్ సాంగ్స్ ని పాడటంతోపాటు నటించి యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. అయితే గతంలో మల్లిక్ తేజతో కలసి పని చేసిన యువతి తనపై మల్లిక్ తేజ అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించింది.

ఈ క్రమంలో తనకి యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయంలో వాటా ఇస్తానని నమ్మబలకడంతోపాటూ పలుమార్లు స్టూడియో రూమ్ లో అత్యాచారానికి పాల్పడినట్లు యువతీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో యువతి ఫిర్యాదు మేరకు ఫోక్ సింగర్ మల్లిక్ తేజపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.