వైద్యం వికటించి చిన్నారి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

వైద్యం వికటించి చిన్నారి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

హన్మకొండ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చిక్సిత పొందుతూ చిన్నారి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందంటూ ఆగ్రహంతో... కుటుంబ సభ్యులు రాత్రి హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. 

న్యాయం చేయాలంటూ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతిపై వివరాలు అడిగితెలుసుకున్నారు. ములుగు జిల్లాకు చెందిన వర్షితకు తీవ్రజ్వరం రావటంతో కుటుంసభ్యులు... ఈనెల 2న ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు.