ఈదురు గాలులకు ఎగిరిపడి చిన్నారి మృతి

ఈదురు గాలులకు ఎగిరిపడి చిన్నారి మృతి

కౌడిపల్లి, వెలుగు : ఈదురు గాలులకు ఇంటి పైకప్పుతో పాటు గాలిలో ఎగిరిపోయి పక్కింటి స్లాబ్​పై పడ్డ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. మెదక్ ​జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజి తండాలో సోమవారం రాత్రి  బలమైన ఈదురు గాలులు వీయడంతో మాలోత్ మాన్​సింగ్​ఇల్లు ధ్వంసమైంది. ఇంటి పైకప్పు రేకులతో పాటు అతడి కూతురు సంగీత (3)  గాలిలో ఎగిరి పక్కనే ఉన్న మరో  బిల్డింగ్ స్లాబ్​పై పడిపోయింది. దీంతో ఆ పాప నోరు, ముక్కులో నుంచి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన తండావాసులు వెంటనే 108 అంబులెన్స్​లో  హైదరాబాద్​లోని  ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది.