అనారోగ్య సమస్యలతో కానిస్టేబుల్ సూసైడ్.. సికింద్రాబాద్​లో ఘటన

అనారోగ్య సమస్యలతో కానిస్టేబుల్ సూసైడ్.. సికింద్రాబాద్​లో ఘటన

పద్మారావునగర్, వెలుగు: అనారోగ్య సమస్యలతో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరేసుకొని మృతి చెందాడు. మహాంకాళి ఇన్స్​పెక్టర్ పరుశురామ్ ​వివరాల ప్రకారం.. 2014 బ్యాచ్​కు చెందిన గాజుల రంగనాథ్​రావు(36) హైదరాబాద్ ఐటీ సెల్​ లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య దాక్షాయణి, 16 నెలల కొడుకు ఉండగా, అంతా కలిసి సికింద్రాబాద్​ కళాసిగూడలో నివాసం ఉంటున్నారు. 

రంగనాథ్​ మూడేండ్లుగా పలు వ్యాధులతో బాధపడుతున్నాడు. రెండేండ్ల కిందట అతనికి సర్జరీ కాగా, ఇప్పటికీ మందులు వాడుతున్నాడు. ఈ నెల16న భార్య దాక్షాయణి పుట్టింటికి వెళ్లగా, అక్కడి నుంచి భర్తకు ఫోన్​చేసింది. లిఫ్ట్​చేయకపోవడంతో తిరిగి రాత్రి ఇంటికి వచ్చింది. అప్పటికే  బెడ్​రూంలోని రంగనాథ్​ఉరేసుకొని మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.