ఫోన్​ పే చేసినట్టు చూపించి షాపు ఓనర్​కు రూ.10 వేలు టోకరా

ఫోన్​ పే చేసినట్టు చూపించి షాపు ఓనర్​కు రూ.10 వేలు టోకరా

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో బట్టల షాపులో చీరలు కొన్న ఓ కస్టమర్​ ఆ షాపు ఓనర్ ​కు ఫోన్​ పే ద్వారా డబ్బులు పంపినట్టు చూపించి మోసం చేశాడు. ఈ నెల 12న జగిత్యాలలోని ఓ బట్టల షాపుకు నెంబర్ ప్లేట్ లేని బైక్ పై ఓ వ్యక్తి వచ్చాడు. షాపులో రూ.2,200 విలువైన మూడు చీరలు కొన్నాడు. తన దగ్గర డబ్బు లేదని ఫోన్ పే చేస్తానని చెప్పాడు. అంతేకాక తనకు అత్యవసరంగా డబ్బులు అవసరముందని చెప్పగా ఆ షాపు యజమానురాలు తన భర్త నంబర్​కు ఫోన్ పే చేయమని చెప్పింది.

 వెంటనే అతడు రూ. పదివేలు ఫోన్ పే ద్వారా పంపిన ట్టు ఫేక్ ​ట్రాన్సాక్షన్   మెసేజ్ చూపించాడు. తర్వా త ఆమె దగ్గర రూ. పదివేలు తీసుకొని వెళ్లిపోయాడు. తర్వాత భర్తకు ఫోన్​చేయగా తన ఫోన్ పే కు ఎటువంటి అమౌంట్ జమ కాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడి ఫొటోను మీడియాకు రిలీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.