టికెట్ తీసుకోమన్నందుకు.. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి..

టికెట్ తీసుకోమన్నందుకు.. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి..

ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకొమ్మన్నందుకు బస్సు డ్రైవర్ పై రాళ్లతో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఆదివారం ( అక్టోబర్ 6, 2024 ) ఇబ్రహీంపట్నం దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇలా ఉన్నాయి... ఆదివారం మద్యాహ్నం బొంగ్లూర్ క్రాస్ రోడ్డు వద్ద ఒక వ్యక్తి మద్యం సేవించి బస్సు ఎక్కగానే సీటులో కూర్చొని కండక్టర్ ఎంతపిలిచిన పట్టించుకోకుండా నిద్రపోయాడని తెలిపారు బస్సు డ్రైవర్.

బస్సు మన్నెగూడా దగ్గరకు చేరుకోగానే..  నిలిసేసి అతన్ని బస్సునుండి దింపివేశామని తెలిపారు డ్రైవర్. దిగగానే అతను రాళ్లతో బస్సుపై దాడికి యత్నించగా.. అది గమనించి అతన్ని ఆపేందుకు యత్నించామని తెలిపారు. ఈ క్రమంలో రాయితో తనపై దాడి చేయగా.. తలకి తీవ్ర గాయమయ్యిందని తెలిపారు డ్రైవర్.

ALSO READ | వరంగల్‎లో విషాదం.. పిడుగు పాటుకు ఇద్దరు రైతులు మృతి

బస్సు డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దాడికి పాల్పడిన వ్యక్తి స్థానిక నందనవనం గాయత్రీనగర్ కు చెందిన శంకర్ గా ఆదిబట్ల పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.