![ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. రూ.10 లక్షల క్లెయిమ్ కొట్టేశారు..!](https://static.v6velugu.com/uploads/2025/02/a-fake-death-certificate-was-created-and-a-claim-of-rs10-lakh-was-made_Q3NIy1Rzrb.jpg)
- కుటుంబ సభ్యులతో కలిసి
- ఎల్ఐసీ ఏజెంట్ మోసం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో వెలుగులోకి..
భద్రాచలం, వెలుగు: బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఎల్ఐసీ క్లెయిమ్ డబ్బులు కొట్టేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బూర్గంపాడు మండలం సారపాకలోని భాస్కర్నగర్కు చెందిన భూక్యా శ్రీరాములు 2017 నుంచి ఎల్ఐసీ ప్రీమియం కడుతుండగా.. ఇటీవల అతని ఒరిజినల్ ఎల్ఐసీ బాండ్ పేపర్లు పోయాయి. కాగా.. సంజీవరెడ్డిపాలెంకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్వద్దకు భూక్యా శ్రీరాములు వెళ్లి తెలిపాడు.
దీంతో క్లెయిమ్ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఏపీలోని కుక్కునూరు మండలం నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చారు. ఒరిజినల్ బాండ్ లేకపోవడంతో ఫేక్ బాండ్తయారు చేయించారు. అయితే.. మరో సీనియర్ఎల్ఐసీ ఏజెంట్ ష్యూరిటీ బాండ్ ఇస్తేనే క్లెయిమ్ ఇస్తారు. ఆయన ఇచ్చిన బాండ్తో డెత్ సర్టిఫికెట్ను కలిపి శ్రీరాములు పేరిట డెత్ క్లెయిమ్ చేసుకుని రూ.10 లక్షలు తీసుకుని.. కుటుంబ సభ్యులు ఏజెంట్లు పంచుకున్నారు.
ఇది కాస్త బయటకు తెలియడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్అయింది. దీంతో భద్రాచలం ఎల్ఐసీ అధికారులు విచారించి రిపోర్ట్ను హెడ్డాఫీసుకు పంపించారు. కాగా సంజీవరెడ్డిపాలెంకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్పరారీలో ఉన్నాడు. దీనిపై భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్మేనేజర్ను వివరణ కోరగా.. నివేదికను హెడ్డాఫీసుకు పంపించామని, పూర్తిస్థాయిలో విచారణ చేశాక వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు.