
కొడంగల్, వెలుగు: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు, అడవిపందుల నుంచి పంటను కాపాడుకునేందుకు మరోరైతు ఏర్పాటు చేసిన కరెంట్ కంచె తగిలి స్పాట్లోనే మృతిచెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ఎనికేపల్లిలో మంగళవారం జరిగింది. ఆంజనేయులు(30) ఉదయం వరికి నీళ్లు పెట్టెందుకు పొలానికి వెళ్ళాడు. అదే గ్రామానికి చెందిన సంగెం హన్మంతు అడవి పందుల నుంచి వరి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి కరెంట్ పెట్టాడు. ఈ క్రమంలో కరెంట్ తీగ అంజనేయులు కాలుకు తగలడంతో అక్కడే మృతిచెందాడని కుటుంబ సభ్యలు, గ్రామస్థులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.