మెట్రో స్టేషన్‌లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం (వీడియో)

మెట్రో స్టేషన్‌లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం (వీడియో)

మహారాష్ట్రలో అర్థరాత్రి మెట్రో స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. పూణెలో ఉన్న ఓ మెట్రో స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. అక్టోబర్ 21 (ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫోమ్‌ మెటీరియల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే మెట్రో స్టేషన్ లో పొగలు కమ్ముకున్నాయి. గమనించిన మెట్రో అధికారులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.

Also Read :- రూ.10 నాణేలపై ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ కీలక ప్రకటన

ఐదు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది.. ఐదు నిమిషాల్లో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్‌లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయని చెప్పారు. మెట్రో స్టేషన్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు.