అగ్ని ప్రమాదంలో కుటుంబసభ్యులు ఐదుగురు మృతి

అగ్ని ప్రమాదంలో కుటుంబసభ్యులు ఐదుగురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆదివారం జరిగిన అగ్నికి ఆహుతి అయ్యారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమైన విషాద ఘటన ఆదివారం ఉదయం 5గంటలకు చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్  నిర్మాణంలో మంటలు చెలరేగాయి. మంటలు మీటర్ బాక్స్‌కు అంటుకుని బిల్డింగ్ చుట్టు పక్కల వ్యాపించాయి.

గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాప్ లో ఓ కుటుంబం నివసిస్తోంది. కుటుంబంలో అందరూ ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకున్నారు.  బయటకు రాలేక.. దహనం అయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన కుటుంబ సభ్యుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులను పోలీసులు పారిస్ గుప్తా (7), మంజు ప్రేమ్ గుప్తా (30), అనితా గుప్తా (39), ప్రేమ్ గుప్తా (30), నరేంద్ర గుప్తా (10)గా గుర్తించారు.