
గండిపేట్, వెలుగు: రాజేంద్రనగర్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై రన్నింగ్ కారులో మంగళవారం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. పొగల్ని గమనించిన డ్రైవర్ కారులోంచి వెంటనే కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. నిమిషాల వ్యవధిలో కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో ఎక్స్ప్రెస్ వేపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించింది.