
హైదరాబాద్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి.. బస్ అంతా వ్యాపించాయి. ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటలు ఎలా చెలరేగాయన్నది తెలియాల్సివుంది.