మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామారంలో శుక్రవారం సెల్ఫోన్చార్జింగ్పెడుతుండగా షాక్కొట్టడంతో ఓ బాలిక చనిపోయింది. గ్రామానికి చెందిన కనికాల రామకృష్ణ తన సెల్ఫోన్చార్జింగ్ పెట్టమని కూతురు అంజలీ కార్తీక(8)కు ఇచ్చాడు. ఆమె వెళ్లి ఇంట్లో కరెంట్ బోర్డు వద్ద చార్జింగ్పెడుతుండగా షాక్ కొట్టి అక్కడిక్కడే చనిపోయింది. అంజలీ కార్తీక 4వ తరగతి చదువుతోంది. చింతకాని ఎస్సై నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.