
మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35) జనగామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్ తో 2015 లో వీణ వివాహం జరిగింది. అయితే గతకొంతకాలంగా భార్యాభర్తలు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో వీణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బీబీపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.