
కొల్చారం, వెలుగు : మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట చెరువులో చేపల కోసం వేసిన వలకు ఓ భారీ కొండ చిలువ చిక్కింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రస్తుతం చెరువు అలుగు పారుతోంది. చేపలు నీటిలో వెళ్లిపోకుండా మత్స్యకారులు వల ఏర్పాటు చేశారు. అందులో సోమవారం కొండ చిలువ చిక్కింది. ఉదయం అటుగా వెళ్లిన రైతులు దాన్ని గమనించి ఫారెస్ట్అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి తీసుకళ్లారు.