
సెప్టెంబర్ 21వ తేదీన సిద్దిపేటలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ (డీఈఈటీ) సంస్థ ఉద్యోగ మేళాను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 21న నిర్వహించనుంది.
20కి పైగా ప్రముఖ కంపెనీలు నిరుద్యోగులను ఇంటర్వ్యూస్ చేయనున్నాయి. 20 కంపెనీలు దాదాపు వెయ్యి మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. విద్యార్హతలు బట్టి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అభ్యర్థుల అర్హతను బట్టి జాబ్స్ ఇవ్వనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి స్పాట్ లోనే ఆఫర్ లెటర్స్ ను కూడా ఇవ్వనున్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఇదొక గొప్ప అవకాశం అంటున్నారు నిర్వాహకులు.
మహీంద్రా ఫైనాన్స్, AI టెక్నాలజీస్, బజాజ్ లైఫ్, మెడ్ ప్లస్, అపోలో ఫార్మసీ, కార్పోన్ బీపీఓ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగమేళాలో పాల్గొంటున్నాయి. ఇంటర్వ్యూల కోసం వచ్చే వారు తప్పనిసరిగా రెజ్యూమ్లతో రావాలని కోరారు.
ఏదైనా సమాచారం కోసం.. Ph. 7337020111 ఈ కింది నెంబర్ లో సంప్రదించవచ్చు. ఇమెయిల్: help@tsdeet.comని సంప్రదించవచ్చు లేదా వెబ్సైట్:www.tsdeet.comని తనిఖీ చేయవచ్చు.