
బచ్చన్నపేట, వెలుగు: మామిడికాయల లోడుతో వస్తున్న లారీ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి బోల్తాపడింది. సూర్యాపేటలో మామిడికాయలు లోడు చేసుకున్న లారీ సిద్దిపేట జనగామ హైవేపై ఆలింపూర్ గ్రామం దాటుతున్న సమయంలో మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
దీంతో లారీలో ఉన్న మామిడికాయలు రోడ్డుపై పడిపోయాయి. హైవే వెంట వెళ్లేవారు మామిడికాయలను సంచుల్లో నింపుకొని పోయారు. తెల్లవారే సరికి సగానికిపై లోడు ఖాళీ అయింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.