గర్ల్‌ఫ్రెండ్‍కు సలహా ఇచ్చిందనే లేడీస్ హాస్టల్‌లోకి దూరి మరీ చంపాడు!

గర్ల్‌ఫ్రెండ్‍కు సలహా ఇచ్చిందనే లేడీస్ హాస్టల్‌లోకి దూరి మరీ చంపాడు!

బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడొద్దని ఆమె ఫ్రెండ్ కు సలహా ఇచ్చిందని కృతి కుమారి అనే యువతిని యువకుడు దారుణంగా చంపాడు. ఈ ఘటన బెంగుళూరులోని వుమెన్స్ పీజీ హాస్టల్‌లో జూలై 23న చోటుచేసుకుంది. కోర‌మంగ‌ల వెంక‌ట‌రెడ్డి లే అవుట్‌లో ఉన్న భార్గవి స్టేయింగ్ హోమ్స్‌లో బీహార్‌కు చెందిన కృతి కుమారి ఉంటుంది. ఈ హత్య కేసులో పోలీసులు నింధితున్ని భూపాల్ లో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. 

అభిషేక్ అనే యువకుడు జూలై 23 రాత్రి హాస్టల్ గ‌దిలోకి దూరి త‌న వ‌ద్ద ఉన్న క‌త్తితో కృతి కుమారిపై అటాక్ చేశాడు. ఆమెను హతమార్చి అక్కడి నుంచి అభిషేక్ పారిపోయాడు.

కుమారితో పాటు ఆ రూమ్‌లో మ‌రో అమ్మాయి ఉంటుంది. ఆమె స్నేహితుడే నిందితుడు అభిషేక్‌. అయితే నిందితుడు అభిషేక్ ప్రతిసారి కుమారి రూమ్‌మేట్‌తో గొడ‌వ‌ప‌డేవాడు. ఆ ఇద్దరి మ‌ధ్య గొడ‌వలు వచ్చినప్పుడు కృతి కుమారి స‌ర్దిచెప్పేది. అయితే అభిషేక్‌కు దూరంగా ఉండాల‌ని త‌న ఫ్రెండ్ కు కుమారి స‌ల‌హా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు.. కుమారిపై క‌త్తితో దాడి చేసిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హాస్టల్ లోని సీసీపుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి.. పరారీలో ఉన్న అభిషేక్ ను రెండు రోజుల్లో అరెస్ట్ చేశారు.