పార్కింగ్ విషయంలో గొడవ.. కత్తితో దాడి

పార్కింగ్ విషయంలో గొడవ.. కత్తితో దాడి

హైదరాబాద్ కూకట్ పల్లిలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. పార్కింగ్ విషయంలో గొడవ పడ్డ జగ్ జ్యోత్ సింగ్ అనే వ్యక్తి.. మరో ఇద్దరు వ్యక్తులు అవినాష్, నవీన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వాహనాన్ని పక్కకు తీయమన్నందుకు.. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం దాడికి దారి తీసింది. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరిని  స్థానికులు ఆస్ప్రత్రికి తరలించారు.   ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జగ్ జ్యోత్  కోసం గాలిస్తున్నారు.