
శంషాబాద్, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలోని ఏటీఎంలో చోరీకి ఓ వ్యక్తి విఫల యత్నం చేశాడు. శంషాబాద్ఎయిర్పోర్ట్ఇన్స్పెక్టర్ బాలరాజు వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున దుండగుడు శంషాబాద్ బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియన్ బ్యాంకు ఏటీఎంలోకి చొరబడ్డాడు. సీసీ కెమెరాల వైర్లను కట్చేశాడు. అనంతరం ఏటీఎం మెషీన్ను ధ్వంసం చేసి, అందులోని నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.
అంతలోనే అలారం మోగడంతో అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులకు సమాచారం అందడంతో రూరల్ఇన్స్పెక్టర్నరేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.