మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు

మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు

 

అల్వాల్, వెలుగు :  మద్యం తాగేందుకు రూ.50 అడిగిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చ బొల్లారం ఏరియాకు చెందిన సురేశ్(45) వృత్తిరీత్యా పెయింటర్. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి వరుసకు సోదరుడైన అల్వాల్​లోని సూర్యానగర్​కు చెందిన భరత్(24) ఈ నెల 13 రాత్రి మచ్చబొల్లారం మీదుగా వెళ్తుండగా, సురేశ్​కలిశాడు. 

తాను మద్యం తాగేందుకు వచ్చానని, రూ.50 తక్కువయ్యాయని, ఇస్తే తాగేసి వెళ్తానని చెప్పాడు. తనను తరచూ పైసలు ఎందుకు అడుగుతున్నావంటూ భరత్ కోప్పడ్డాడు. ఈ క్రమంలో మాటామాట కొట్లాటకు దిగారు. భరత్​సురేశ్​ముఖం, తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు సురేశ్​ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.