హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. లింగంపల్లి తారానగర్ లోని ఓ ఇంట్లో తన్నీరు మాల్యాద్రి(37) అనే వ్యక్తిని హత్య చేశారు దుండగులు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు ఉండటంతో తాగిన మత్తులో హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ పై తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం జాగిలాలతో చుట్టుపక్కల గాలిస్తున్నారు.
మృతుడి స్వస్థలం నెల్లూరు. దసరా హాలిడేస్ కావడంతో భార్య పిల్లలను సొంత ఊరికి పంపడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.