దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన ఉన్మాది

దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన ఉన్మాది

షాద్ నగర్: పందులు దొంగలించడాన్ని చూశాడని ఆరేళ్ల బాలుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని హాజీపల్లి రోడ్ లో కొంతమంది జీవనోపాధి కోసం ఎంతో కాలంగా గుడిసెలు వేసుకొని పందుల పెంపకంపై ఆధారపడి ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి సమయంలో ఎల్లయ్య అనే వ్యక్తి పందులను దొంగలిస్తుండగా.. దుర్గయ్య, సాయమ్మల ఆరేళ్ల కుమారుడు కట్టప్ప చూశాడు. 

దొంగతనానికి  పాల్పడ్డ ఎల్లయ్య ఆ విషయాన్ని కట్టప్ప ఎవరికైనా చెబుతాడేమోనని అనుమానంతో ఆ బాలుడిని బండరాయికి కొట్టి చంపాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృదేహాన్ని పోస్టుమార్టం చేసి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.