
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. దుండగులు ఏటీఎంను ధ్వంసం రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. నిన్న అర్ధరాత్రి రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి ఓ వెహకిల్లో నలుగురు దుండగులు మాస్కులు ధరించి వచ్చారు. అక్కడ తమ ఫుటేజ్ రికార్డు కాకుండాఉండడానికి సీసీ కెమెరాలపై స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.25 లక్షల క్యాష్ను ఎత్తుకెళ్లారు. ఏటీఎం విడిభాగాలను బయట పడేశారు. సమాచారం తెలుసుకున్న రుద్రూర్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.