బంజారాహిల్స్ లోని పార్క్​హయత్ హోటల్ లో అగ్ని ప్రమాదం

బంజారాహిల్స్ లోని పార్క్​హయత్ హోటల్ లో అగ్ని ప్రమాదం
  • ఫస్ట్​ ఫ్లోర్ స్టీమ్​ బాత్ రూమ్​లో షార్ట్ సర్య్కూట్​తో మంటలు 
  • ఆర్పి వేసిన హోటల్, ఫైర్​ సేఫ్టీ సిబ్బంది

జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్ లోని పార్క్​హయత్​ హోటల్​లో సోమవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్​లో ఉన్నవారు కాసేపు ఆందోళనకు గురయ్యారు. నిర్వాహకులు బిల్డింగ్​ఫస్ట్​ఫ్లోర్​లోని ఓ గదిని స్టీమ్​బాత్​కు కేటాయించగా, అందులో కర్రను ఎక్కువగా వాడారు. సోమవారం ఉదయం 10 గంటలకు  స్టీమ్​బాత్ గదిలో షార్ట్​సర్క్యూట్​కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. గుర్తించిన హోటల్​సిబ్బంది ఫైర్​సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్​సేఫ్టీ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

ఇదే హోటల్​లో సన్​రైజర్స్​ టీమ్​ 

ఐపీఎల్​మ్యాచ్​కోసం సిటీకి వస్తున్న సన్​రైజర్స్​హైదరాబాద్​ప్లేయర్స్​పార్క్​హయత్​హోటల్ లోనే బస చేస్తున్నారు. 5, 6 ఫ్లోర్లలో ఉంటున్నారు. ఈ నెల 12 జరిగిన ఉప్పల్​మ్యాచ్​కోసం వచ్చి పార్క్​హయత్ ఉండిపోయారు. షెడ్యూల్​ప్రకారం సోమవారం ఉదయం ఫైర్​యాక్సిడెంట్​జరగక ముందే కొందరు హెటల్​ను వెకేట్​చేసి ఎయిర్​పోర్టుకు స్టార్ట్​అయ్యారు. మరికొందరు ప్రమాదం జరిగిన తర్వాత బయలుదేరి ఎయిర్​పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తర్వాత మ్యాచ్​కోసం ముంబై వెళ్లారు. ఎవరికీ ఎటువంటి  ప్రమాదం జరగలేదని, పొగ ఎక్కువ ఉండడంతో ఫైర్​స్టాఫ్​సకాలంలో స్పందించి క్లియర్​చేశారని జిల్లా ఫైర్​ఆఫీసర్​వెంకన్న తెలిపారు.