జడ్చర్ల పట్టణంలో వికసించిన అరుదైన పుష్పం

జడ్చర్ల  పట్టణంలో వికసించిన అరుదైన పుష్పం

జడ్చర్ల, వెలుగు: పట్టణంలోని బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ ఆవరణలోని బొటానికల్ గార్డెన్ లో అరుదైన బ్రాకిస్టెల్మా బైలోబేటమ్  పుష్పించినట్లు ప్రిన్సిపాల్  సుకన్య తెలిపారు. ఈ మొక్కను కాలేజీ బాటనీ లెక్చరర్​ సదాశివయ్య, ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కాలేజీ లెక్చరర్​ ప్రసాద్  2020లో గుర్తించి బ్రాకిస్టెల్మా బైలోబేమ్​గా నామకర ణం చేసినట్లు చెప్పారు.

 ఈ మొక్క నల్లమల ప్రాంతంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించదని, సన్నని కాండంతో 25 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుందని తెలిపారు. ప్రతి కనుపు వద్ద తెల్లని కేశాలు గల రెండు ముదురు ఎరుపు, నల్లని పుష్పాలు పూస్తాయని గార్డెన్  సమన్వయకర్త  సదాశివయ్య తెలిపారు.