
ఫ్యాక్టరీలో మొదట ఒక రియాక్టర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మేనేజర్ రవితోపాటు మరో నలుగురు కార్మికులు చనిపోయినట్లు నిర్ధారించారు. పేలుడు ధాటికి డైరెక్టర్ రవి, సుబ్రమణ్యం, సురేష్ , పాల్,దామోదర్ స్పాట్ లోనే చనిపోయారు. దాదాపు 10మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. నాలుగు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు ఫైర్ సిబ్బంది. రియాక్టర్ పేలుడుతో సమీపంలోని మూడు భవనాలు కుప్పకూలాయి. ఈ శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు ఉండొచ్చని సహాయక చర్యలు చేపట్టారు.