అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై రన్నింగ్ కారు దగ్ధం

అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై  రన్నింగ్ కారు దగ్ధం

నల్గొండ : హైవేపై వెళ్తున్న కారులో శుక్రవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మాడుగుపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో అద్దంకి, నార్కెట్ పల్లి రహదారిపై అగ్నిప్రమాదం సంభవించింది. రన్నింగ్ లో ఉన్న కారు ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. అది గమనించిన స్థానికులు కారులో అద్దాలు పగలగొట్టి డ్రైవర్ ను బయటికి తీశారు. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ప్రయాణికుడిని నల్గొండ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కారు పూర్తిగా కాలిపోయింది. చిన్నపాటి గాయాలతో డ్రైవర్ కి తృటిలో ప్రాణాపాయం తప్పింది.