
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో మైనర్ బాలికను హత్యాచారం చేసి హత్య చేశారు. కట్నపల్లి గ్రామంలో ఓ రైస్ మిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సహస్ర అనే ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి చంపేశాడు యూపీకి చెందిన బలరాం అనే అమాలి కార్మికుడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.