రైతు భరోసాపై అన్నదాతల అభిప్రాయాలు : గండ్ర సత్యనారాయణ రావు

రైతు భరోసాపై అన్నదాతల అభిప్రాయాలు : గండ్ర సత్యనారాయణ రావు

మొగుళ్లపల్లి/ తాడ్వాయి/ ధర్మసాగర్/ స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : అన్నదాతల అభిప్రాయం మేరకే రైతు భరోసా అమలు చేయనున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి రైతు వేదికలో పీఏసీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో రైతుబంధు పథకం అమలు తీరుపై రైతులతో ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో రైతులు తమ సూచనలు, సలహాలు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతని, వారి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారని అన్నారు

కార్యక్రమంలో డీసీవో శైలజ, రైతులు పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి రైతు వేదికలో వ్యవసాయ అధికారి జైసింగ్​ ఆధ్వర్యంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా మెజార్టీ రైతులు ఐదు ఎకరాల వరకే రైతు భరోసా వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో డీసీవో నాగేశ్వరరావు అధ్యక్షతన రైతుల అభిప్రాయాలు సేకరించారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్​రెడ్డి అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి డీసీవో రాజేందర్​రెడ్డి హాజరై రైతుల అభిప్రాయ సేకరణ చేశారు.