
శామీర్ పేట, వెలుగు: శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఓ వృద్ధురాలికి బైక్పై లిఫ్ట్ ఇచ్చి, కొంత దూరం వెళ్లాక ఆమె మెడలోని 2 తులాల పుస్తెలతాడును చోరీ చేశాడు. సీఐ శ్రీనాథ్ కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ధర్మారం గ్రామానికి చెందిన సరపల్లి వరలక్ష్మి శుక్రవారం పెన్షన్డబ్బులు తీసుకునేందుకు తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్కు వచ్చింది. డబ్బులు తీసుకుని, స్వగ్రామం వెళ్తోంది. మార్గమధ్యలో దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద దిగి, కీసర వైపు వెళ్లేందుకు బస్టాండ్లో ఎదురుచూస్తోంది. ఆ సమయంలో అక్కడికి గుర్తు తెలియని ఓ యువకుడు బైక్పై వచ్చి, తాను తిమ్మాయిపల్లి వెళ్తున్నానని, దారిలో దింపేస్తానని నమ్మించాడు. బైక్ఎక్కించుకుని, కొంత దూరం వెళ్లాక.. ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని, పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.