
ఎవాల్యుయేషన్ తర్వాత టెండరు ఫైనల్ చేయనున్న రైల్వే
హైదరాబాద్, వెలుగు : ఖాజీపేట రైల్వే వాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్కు మొత్తం 7 కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. బుధవారం రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) అధికారులు టెండర్లు ఓపెన్ చేశారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తున్నామని, ఆర్వీఎన్ఎల్ గైడ్ లైన్స్ ప్రకారం టెక్నికల్గా క్వాలిఫై అయిన కంపెనీల ఫైనాన్సి యల్ బిడ్ను త్వరలో ఓపెన్ చేయను న్నట్లు అధికారులు తెలిపారు. తర్వాత టెండర్ ఫైనల్ చేయనున్నారు. ఫైనాన్సి యల్ బిడ్ లో ఎల్ 1 గా నిలిచిన కంపెనీ టెండర్ దక్కించుకోనుంది.
ఏయే కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయో చెప్పేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరాకరించారు. ఈ వారం లోనే టెండర్ ఫైనల్ చేస్తామని చెప్తు న్నారు. రూ.383 కోట్లతో ఈ యూనిట్ ను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. 2016లో రూ.269 కోట్లతో ఈ యూనిట్ ను కేంద్రం సాంక్షన్ చేయగా, దీనికి కావాల్సిన భూమిని రాష్ట్ర సర్కారు సకాలంలో అప్పగించకపోవడంతో జాప్యం అయ్యింది. రెవెన్యూ శాఖ క్లియరెన్స్తో ఆర్వీఎన్ఎల్ అధికారులు టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టారు.