
కోల్బెల్ట్/చెన్నూరు, వెలుగు: విదేశీ పర్యటన అనంతరం చెన్నూరు నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జైపూర్ మండలం ఇందారం వద్ద ఎమ్మెల్యేకు శాలువా కప్పి బొకే అందజేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ అంశాలపై ఆయన లీడర్లు, కార్యకర్తలను ఆడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ఫయాజ్, ముక్తి శ్రీనివాస్, బండి సదానందం యాదవ్, మల్లేశ్, అరికె సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నష్టపోయిన చెన్నూరు మండలం సుందరశాల గ్రామ రైతులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వివేక్ను కలిశారు. బ్యాక్ వాటర్తో తమ పంటలు, భూములకు నష్టం జరుగుతోందని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతుల మనవరాలు నైనా బర్త్డే వేడుకలు బుధవారం రాత్రి నిర్వహించగా ఎమ్మెల్యే వివేక్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, సీనియర్జర్నలిస్ట్ ఎండీ మునీర్, దుర్గం నరేశ్ తదితరులు హాజరై చిన్నారిని అశీర్వదించారు.
మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు హెచ్.రవీందర్ తల్లి ఈశ్వరమ్మ, బీజేపీ లీడర్ అందుగుల శ్రీనివాస్ మామ కోలా ఎల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆ కుటుంబాలను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.