హైదరాబాద్ లో మహిళ దారుణ హత్య..

హైదరాబాద్ లో మహిళ దారుణ హత్య..

హైదరాబాద్ దారుణం జరిగింది. మియాపూర్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. మియాపూర్ లోని దీప్తిశ్రీ నగర్ లో సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) ఉదయం చోటు చేసుకుంది ఈ ఘటన. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి మహిళను హత్య చేసినట్లు సమాచారం.కొద్దీ రోజులుగా భార్య భర్త ల మధ్య గొడవలు ఉన్నాయని, ప్రస్తుతం కోర్ట్ లో ఇరువురి మధ్య విడాకుల కేసు నడుస్తోందని కుటుంబసభ్యులు తెలిపారు.

ALSO READ | స్పీడ్ తగ్గించాలని అన్నందుకే.. కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన్రు

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాల కోసం సీసీటీవీ కెమరాలను పరిశీలిస్తున్నారు.