
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ లో దారుణం జరిగింది. ఏప్రిల్ 24న బాబయ్య అనే వ్యక్తి ఓ మహిళను ఇంట్లోనే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్థానికులు ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళతో అక్రమ సంబంధమే ఈ దారుణానికి కారణమని అనుమానిస్తున్నారు. అసలు ఆ మహిళ ఎవరు..ఎందుకు హత్య చేశారనేదానిపై వివరాలు ఆరాదీస్తున్నారు. నిందితుడు బాబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.