కూకట్‌పల్లిలో హైడ్రా భయంతో ఉరేసుకున్న మహిళ

కూకట్‌పల్లిలో హైడ్రా భయంతో ఉరేసుకున్న మహిళ

హైదరాబాద్ లో చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన ఇళ్లను హైడ్రా కూల్చి వేస్తుదోంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా భయానికి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్ పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆమె కూతుళ్లకు కట్నంగా ఇచ్చిన ఇళ్లను కూల్చివేస్తారేమో అని ఉరేసుకొని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. ముగ్గురు బిడ్డలకు పెళ్లీలు చేసి హైదరాబాద్ లోని కొన్ని ఇళ్లను కట్నంగా ఇచ్చారు. కూల్చివేతలలో భాగంగా ఇండ్లు ఖాళీ చేయిస్తారేమో అని భయంతో బుచ్చమ్మ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుచ్చమ్మ ముగ్గురు కుమార్తెలు బోరున విలపిస్తున్నారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ALSO READ | మియాపూర్‎లో 9వ అంతస్తు నుండి దూకి మహిళ సాప్ట్ వేర్ ఆత్మహత్య