లారీ ఢీకొని యువకుడు మృతి

లారీ ఢీకొని యువకుడు మృతి

పద్మారావునగర్, వెలుగు: తార్నాక మెట్రోపిల్లర్ సమీపంలో గుర్తు తెలియని వెహికల్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. చిలకలగూడ ఎస్ఐ పి.కిషోర్​తెలిపిన ప్రకారం.. భోలక్​పూర్ కు చెందిన యువకుడు మోహిన్ సుల్తాన్​(28), మల్కాజిగిరిలో చిరు వ్యాపారం చేస్తుంటాడు. బుధవారం రాత్రి  ఫ్రెండ్​బర్త్​ డే వేడుకల్లో పాల్గొని తెల్లవారుజామున 3 గంటలకు తార్నాక నుంచి ఇంటికి వెళ్తున్నాడు. 

మెట్రో పిల్లర్​ నంబర్1084 వద్ద యూటర్న్​ తీసుకుంటుండగా గుర్తు తెలియని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రగాయాలపాలైన సుల్తాన్​ను 108 సిబ్బంది పరీక్షించి చనిపోయినట్లు తెలిపారు. మృతుడి సోదరుడు మన్సూర్​సుల్తాన్​ ఫిర్యాదుతో  కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.