రన్నింగ్ ట్రైన్ దిగుతూ.. యువకుడు మృతి

రన్నింగ్ ట్రైన్ దిగుతూ.. యువకుడు మృతి

సికింద్రాబాద్​, వెలుగు: రైలు నుంచి జారి పడి యువకుడు మృతిచెందాడు.  సికింద్రాబాద్​రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. భద్రాద్రి జిల్లా పాత పాల్వంచకు చెందిన షేక్ మహమ్మద్ ఆసిఫ్(20)  సిటీకి వచ్చి చైతన్యపురిలో ఉంటూ.. ఓమ్ని ఆస్పత్రిలో సూపర్​వైజర్ గా చేస్తున్నాడు. అతడు ఫీవర్ తో బాధపడుతుండగా సొంతూరు తీసుకెళ్లేందుకు అతని తమ్ముడు వచ్చాడు. 

ఇద్దరూ కలిసి బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. 3 నంబర్ ప్లాట్​ఫామ్ మీద కాకతీయ ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సింది పోయి.. పొరపాటున 2 నంబర్ ప్లాట్ ఫామ్ పై చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. వేరే ట్రైన్ ఎక్కామని తెలుసుకుని మౌలాలి రైల్వే స్టేషన్ లో  ట్రైన్ వెళ్తుండగా.. కిందకు దిగుతూ ఆసిఫ్ జారిపడడంతో తలకు, బాడీకి తీవ్ర గాయాలై స్పాట్​లో మృతి చెందాడు. రైల్వే పోలీసులు డెడ్​బాడీని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.