
హైదరాబాద్: కుత్బుల్లాపూర్లోని పేట్బహీరాబాద్పీఎస్పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వలేదని యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ఈవెంట్కోసం రూ. 5 లక్షలను యశ్వంత్అనే యువకుడు తన ప్రెండ్ ఫైనాన్సర్శ్రీనాథ్రెడ్డి దగ్గర అప్పుగా తీసుకున్నాడు. దీంతో అప్పు తిరిగి ఇవ్వాలని ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఫైనాన్సర్శ్రీనాథ్ రెడ్డి, అతడి గ్యాంగ్తో కలిసి ఈ నెల14న హోలి పండుగ రోజున యశ్వంత్ను బజాబ్షో రూమ్గ్రౌండ్స్కు పిలిచి కిడ్నాప్చేశారు. అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో ఇంటి నుంచి వెళ్లిన కొడుకు రాకపోవడంతో బాధితుడి తల్లి శ్రీనాథ్రెడ్డితో పాటు, 15 మందిపై పేట్బహీరాబాద్పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఫైనాన్స్పేరుతో శ్రీనాథ్రెడ్డి 10–15 రూపాయల ఇంట్రెస్ట్వసూళ్ల చేస్తున్నారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | వ్యభిచార రొంపిలో దింపేందుకు బాలిక కిడ్నాప్.. తర్వాత జరిగింది ఇదే..