పెండ్లి కావట్లేదనే బాధతో యువతి సూసైడ్

పెండ్లి కావట్లేదనే బాధతో యువతి సూసైడ్

మియాపూర్, వెలుగు : ఎన్ని పెండ్లి సంబంధాలు చూసినా కుదరకపోవడంతో డిప్రెషన్​కు లోనైన ఓ యువతి సూసైడ్ ​చేసుకుంది. ఈ ఘటన మియాపూర్​పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ జనప్రియ అపార్ట్​మెంట్​లో ఉండే బోరగడ్డ కిస్టోఫర్​కూతురు శ్రుతి(35) ఎంఫార్మసీ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు ఎన్ని పెండ్లి సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడంతో డిప్రెషన్​కు గురైంది.

శనివారం ఉదయం 11 గంటల సమయంలో అపార్ట్​మెంట్​బిల్డింగ్​నాలుగో ఫ్లోర్​నుంచి కిందికి దూకింది. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.