
పద్మారావునగర్, వెలుగు: వారాసిగూడలో ఉరేసుకొని యువతి మృతి చెందింది. ఇన్స్పెక్టర్సైదులు వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన నూనవత్చలపతి కూతురు సంధ్య(22) ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి, జాబ్ కోసం మూడేండ్ల కింద సిటీకి వచ్చింది. ఆ తర్వాత కాల్సెంటర్లో పనిచేస్తూ అమీర్పేటలోని హాస్టల్లో ఉంది. 4 నెలల క్రితం ఆ జాబ్ను వదిలిపెట్టింది. అనంతరం గాంధీనగర్లోని హోమ్కార్ ఆఫీస్లో జాబ్ చేస్తూ, వారాసిగూడ పీఎస్ పరిధిలోని న్యూ అశోక్నగర్లో అద్దెకు ఉంటోంది.
తండ్రి చలపతి రెగ్యులర్గా కూతురుకు ఫోన్ చేస్తూ, యోగ క్షేమాలు తెలుసుకునే వాడు. అయితే, ఆదివారం పలుమార్లు ఫోన్ చేయగా, ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబసభ్యులు సోమవారం ఉదయం కూతురు ఇంటికి వెళ్లి చూడగా, ఫ్యాన్ కు ఉరేసుకొని కన్పించింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
శామీర్ పేట: జినోమ్ వ్యాలీ పీఎస్ పరిధిలోనూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లాల్ గడి మలక్ పేటకు చెందిన నాగరాజు (21)సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో గ్రామ శివారులోని మల్లన్న గుడి వద్ద చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు.