మోదీకి కేజ్రీవాల్ సవాల్... అలా చేస్తే బీజేపీ తరపున ప్రచారం చేస్తా

మోదీకి కేజ్రీవాల్ సవాల్... అలా చేస్తే బీజేపీ తరపున ప్రచారం చేస్తా

ప్రధాని మోదీకి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ పాలిత  రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే  బీజేపీ తరపున ప్రచారం చేస్తానని అన్నారు.

 జన్తా కీ అదాలత్  సభలో మాట్లాడిన కేజ్రీవాల్..  బీజేపీ  డబుల్ ఇంజన్  సర్కార్ లు అంతటా విఫలమయ్యాయని విమర్శించారు.  మోదీ డబుల్ ఇంజిన్   ప్రభుత్వం అంటే డబుల్ లూట్..  డబుల్ కరప్షన్ అని ధ్వజమెత్తారు.

ALSO READ | పక్కా వ్యూహంతో మావోయిస్టులపై భద్రతా బలగాల అటాక్ : 2 రోజులు.. 1000 మంది జవాన్లు

 2025 ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందించాలని ప్రధాని మోదీకి నేను సవాలు విసురుతున్నాను. అలా చేస్తే నేను బీజేపీకి ప్రచారం చేస్తాను' అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు కూలిపోతాయని కేజ్రీవాల్ అన్నారు.  జార్ఖండ్,మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందన్నారు.