భగవంత్​ మాన్​పై ఆరోపణలు

భగవంత్​ మాన్​పై ఆరోపణలు

చండీగఢ్: మద్యం తాగి విమానం ఎక్కిన సీఎం భగవంత్​ మాన్​ను జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ ఎయిర్​పోర్టులో సిబ్బంది దించేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఢిల్లీ వచ్చేందుకు లుఫ్తాన్సా ఫ్లైట్​ ఎక్కిన టైంలో ఈ ఘటన జరిగిందని శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ) చీఫ్​ సుఖ్​బీర్ ​సింగ్  బాదల్​ ఆరోపించారు. ‘‘అసలు నడవలేని స్థితిలో భగవంత్​ మాన్ ఉన్నట్టు కొందరు ప్యాసింజర్లు​ మీడియాకు చెప్పారు. దీంతో విమానం 4గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

అందుకే ఢిల్లీలో నిర్వహించిన ఆప్​ సదస్సుకు ఆయన హాజరుకాలేదు. పంజాబీలు, దేశ గౌరవానికి సంబంధించిన అంశం కావడంతో ఇండియన్​ గవర్నమెంట్​ కలగజేసుకోవాలి. జర్మనీ ప్రభుత్వంతో మాట్లాడి నిజమేంటో బయటపెట్టాలి” అని సుఖ్​బీర్​సింగ్​ డిమాండ్​ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష​ నేత ప్రతాప్​ సింగ్ బాదల్​ కోరారు. ఈ ఆరోపణలను ఆప్​ నేత మల్విందర్​ సింగ్​ ఖండించారు.