- రాహుల్ సహా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖ
న్యూఢిల్లీ: ఇండియా కూటమి నేతలంతా సమావేశమై తనపై జరిగిన దాడిపై చర్చించాలని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కోరారు. మంగళవారం ఈమేరకు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్కు ఆమె లేఖ రాశారు. “సొంత పార్టీ వాలంటీర్లు, నేతలు నాకు సాయం చేయడానికి బదులు దాడులకు పాల్పడ్డారు. నా క్యారెక్టర్ను కించపరిచారు. నామీద జరిగిన దాడిపై ఇండియా కూటమి నేతలంతా చర్చించాలి.
గత 18 ఏండ్లుగా నేను కిందిస్థాయిలో పనిచేశాను. 9 ఏండ్లలో మహిళా కమిషన్ లో 1.7 లక్షల కేసులు విన్నాను. ఎవరికీ భయపడకుండా, ఎవరి ముందు తలవంచకుండా మహిళా కమిషన్ను టాప్ పొజిషన్కు చేర్చాను. అయితే, సీఎం ఇంట్లో నన్ను దారుణంగా కొట్టి నా క్యారెక్టర్ను దిగజార్చారు. ఇండియా కూటమిలోని టాప్ లీడర్లందరికి దీనిపై నేను లేఖ రాశాను. సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించాలని నేను కోరుతున్నాను” అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు.